ప్రస్తుతం రోజు రోజుకి బంగారం ధర పెరుగుతూ వస్తుంది. దీనికి ముఖ్య కారణం జువెలర్ల నుంచి డిమాండ్ పుంజుకోవడే. కానీ వెండి షరా మాత్రం స్వల్పంగా తగ్గింది. ఇదిలా ఉండగా గ్లోబెల్ మార్కెట్లో బంగారం స్వల్పంగా తగ్గగా.. వెండి వెండి ధర మాత్రం, పెరిగింది. పసిడి పరిగెడుతూనే ఉంది. హైదరాబాద్ మార్కెట్లో ఆదివారం పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.130 పెరుగుదలతో రూ.39,190కు చేరింది. అంతర్జాతీయంగా బలహీనమైన ట్రెండ్ ఉన్నప్పటికీ జువెలర్లు, రిటైలర్ల నుంచి డిమాండ్ పుంజుకోవడంతో ధరపై సానుకూల ప్రభావం పడిందని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు.
అదేసమయంలో 10 గ్రామలు 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.130 పెరుగుదలతో రూ.35,820కు ఎగసింది. బంగారం ధర పెరిగితే.. వెండి ధర మాత్రం స్వల్పంగా క్షీణించింది. కేజీ వెండి ధర రూ.3 క్షీణతతో రూ.44,522కు తగ్గింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ లేకపోవడం ఇందుకు కారణం. విజయవాడ, విశాఖపట్నంలో కూడా ధరలు ఇలానే ఉన్నాయి. ఢిల్లీ మార్కెట్లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.150 పెరుగుదలతో రూ.37,800కు చేరింది. ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.150 పెరుగుదలతో రూ.36,600కు దిగొచ్చింది.
ఇక కేజీ వెండి ధర స్వల్పంగా తగ్గింది. కేవలం రూ.3 తగ్గుదలతో రూ.44,522కు క్షీణించింది. గ్లోబల్ మార్కెట్లో శుక్రవారం బంగారం ధర తగ్గింది. పసిడి ధర ఔన్స్కు 0.08 శాతం తగ్గుదలతో 1,508.35 డాలర్లకు క్షీణించింది. అదేసమయంలో వెండి ధర ధర ఔన్స్కు 0.08 శాతం పెరుగుదలతో 16.95 డాలర్లకు ఎగసింది. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి.